నోటా మొదట ఆ స్టార్ హీరో దగ్గరికి వెళ్ళింది !

నోటా మొదట ఆ స్టార్ హీరో దగ్గరికి వెళ్ళింది !

Published on Sep 28, 2018 1:00 PM IST

Allu Arjun
‘నా పేరు సూర్య’ చిత్రం తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంతవరకు తన కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు. ఇక ఈచిత్రం తరువాత బన్నీని ‘నోటా’ డైరెక్టర్ ఆనంద్ శంకర్ కలిశాడట. నోటా కథను మొదట బన్నీ కి వినిపిస్తే ఈ కథ తనకు సెట్ అవ్వదని ఆయన రిజెక్ట్ చేశాడని సమాచారం.

ఆతరువాత అదే కథతో ఆనంద్ శంకర్ యువ హీరో విజయ్ దేవరకొండ ను కలిశాడట. విజయ్ కు కథ నచ్చడంతో ఈ సినిమా పట్టాలెక్కింది. ఇక ఈ సినిమాతోనే విజయ్ తమిళ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. పొలిటికల్ డ్రామా గా తెరకెక్కిన ఈచిత్రం తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్ 5న విడుదలకానుంది.

తాజా వార్తలు