
విజయ్ ఆంటోని, నివేదా పేతురాజ్ జంటగా నటించిన చిత్రం ‘రోషగాడు’ నవంబర్ 16న విడుదలైంది. ఈ సందర్భంగాహైదరాబాద్లో ఏర్పాటు చేసిన థాంక్స్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ మీట్ లో చిత్ర నిర్మాత జశ్వంత్ మాట్లాడుతూ ఈ సినిమా తెలుగులో విడుదల చేయడానికి రెండున్నర నెలల ప్రయత్నించి ఈ సినిమా హక్కులు సాధించాను. డైరెక్టర్ గణేశా గారు సినిమాను చాలా బాగా తెరకెక్కించారు. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్ అన్నారు.
చిత్ర దర్శకులు గణేశా మాట్లాడుతూ తెలుగు లో చేద్దాం అని రెడి చేసిన సినిమా.కథ విజయ్ గారికి నచ్చడంతో ఒప్పుకున్నారు. ఆడియన్స్ ఇది యాక్షన్ సినిమా అనుకుంటున్నారు. కానీ ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఇందులో మంచి పాయింట్ కూడా ఉంటుంది. ప్రస్తుతం టీనేజ్ పిల్లలు ఎలా చెడు వైపు ఆలోచిస్తారు సినిమా ఈ జెనరేషన్ కోసమే కాకుండా నెక్స్ట్ జెనరేషన్ కోసం కూడా ఉపయోగపడుతుంది“ అన్నారు
విజయ్ ఆంటోని మాట్లాడుతూ ఎప్పటి లాగే చాలా సంతోషంగా ఉంది. సినిమాను ఇంత అద్భుతంగా తెరకెక్కించిన గణేశా గారికి థాంక్స్. జశ్వంత్ గారు ఈ సినిమాకు చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి అల్ ద బెస్ట్.రామకృష్ణ, బాలకృష్ణ గారికి థాంక్స్ .భాషాశ్రీ గారితో నా అసోసియేషన్ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా ఇంకా ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉందని అన్నారు.

