
రామ్ చరణ్ రాబోతున్న చిత్రం “నాయక్” ఇటు అభిమానులకు అటు సిని ప్రేమికులకు కన్నుల పండుగ కానుంది.ఈ చిత్రంలో పలు అందమయిన ప్రదేశాలను మరింత అందంగా కెమెరాలో బంధించి చూపించనున్నారు. రామ్ చరణ్ మరియు అమల పాల్ మీద తెరకెక్కించిన “శుభలేఖ రాసుకున్న” పాటను తొలిసారిగా స్లోవేనియాలో చిత్రీకరించారు. స్లోవేనియాలో చిత్రీకరించబడిన తొలి భారతీయ చిత్రం “నాయక్” ఇప్పటి వరకు స్విట్జర్లాండ్ కి మాత్రమే మన చిత్రాలు పరిమితమయ్యాయి. కొన్నాళ్ళయ్యాక కొంతమంది దర్శకులు ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ మరియు గ్రీస్ వంటి దేశాలకు వెళ్ళారు. ప్రస్తుతం “నాయక్” చిత్ర బృందం మరో అడుగు ముందేసి స్లోవేనియాలో చిత్రీకరణ జరిపారు. వి వి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డి వి వి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 2013 సంక్రాంతికి విడుదల చెయ్యనున్నారు.
కన్నుల పండుగ కానున్న రామ్ చరణ్ “నాయక్”
కన్నుల పండుగ కానున్న రామ్ చరణ్ “నాయక్”
Published on Sep 23, 2012 2:29 AM IST
సంబంధిత సమాచారం
- మహేష్, ప్రభాస్ ఫెయిల్.. బన్నీ అయినా చేస్తాడా..?
- ‘టాక్సిక్’ లో వల్గారిటీ.. యశ్ ఇచ్చాడు క్లారిటీ..!
- 51 ఇయర్స్ ఆఫ్ తలైవా.. ‘ధర్మన్’ సెట్స్ లో గ్రాండ్ సెలెబ్రేషన్స్..!
- ‘లెనిన్’ సక్సెస్.. అఖిల్ సైలెంట్.. ఎందుకో..?
- సూర్యతో ఎప్పటికైనా సినిమా చేస్తా – త్రివిక్రమ్
- ఘనంగా శ్రీహరి జయంతి వేడుకలు..!
- ‘ఆస్మాన్’తో మేఘాంశ్ సక్సెస్ అందుకోవాలి – శాంతి శ్రీహరి
- 3 నెలల్లో 2 బ్లాక్ బస్టర్స్.. సూర్య సత్తా ఇది..!
- మరోసారి సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ సినిమా!?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !
- ‘ది ప్యారడైజ్’ ఆ సీనియర్ యాక్టర్కు కలిసి వస్తుందా..?
- ‘ఆదర్శ కుటుంబం’ కోసం రాజుగారి ప్రయత్నం.. ఫలించేనా..?
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు అక్కడ రిలీజ్ కష్టాలు..!
- మరో భాషలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ‘మా ఇంటి బంగారం’
- సమీక్ష: హుషార్ పిట్టలు – కొన్ని సీన్స్ ఇబ్బంది పెట్టినా సందేశం బాగుంది

