సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ ని నిన్నటి నుండి సరిలేరు నీకెవ్వరు మేకర్స్ సస్పెన్సు లో పెట్టారు. నేడు ఓ మైల్ స్టోన్ అనౌన్స్మెంట్ రానుందని వారు ప్రకటించినప్పటి నుండి.. ఆ బిగ్ సర్ప్రైజింగ్ అనౌన్స్మెంట్ ఏమై ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వారి ఆతృతకు తెరదించుతూ సరిలేరు నీకెవ్వరు మూవీ నుండి ఓ బిగ్ అప్డేట్ ఇచ్చారు.
అదేమిటంటే సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ అతిధిగా రానున్నారు. వచ్చే నెల 5న ఎల్ బి స్టేడియం లో సాయంత్రం జరగనున్న ఈ మెగా ఈవెంట్ కి చిరు ముఖ్య అతిధిగా రానున్నట్లు ఓ ప్రత్యేక వీడియో ద్వారా చిత్ర యూనిట్ తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి, మహేష్ ఒకే వేదికపై కనిపించింది చాలా అరుదు. సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుక సాక్షిగా ఈ అరుదైన సంఘటన ఆవిష్కృతం కానుంది. దిల్ రాజు సమర్పణలో రామ బ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. మహేష్ సరసన రష్మిక మందాన నటించగా వచ్చే నెల 11న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
Adding Grace & Style to the first & biggest celebration of 2020 !!#MegaStarChiranjeevi gaaru ???? will be gracing #SarileruNeekevvaru PreRelease Event on JAN 5th at LB Stadium ????️ ????
Gear up for the #MegaSuperEvent ????#SarileruNeekevvaruOnJan11th pic.twitter.com/HEXycTr8Fs
— Sri Venkateswara Creations (@SVC_official) December 20, 2019


