కొద్దిరోజులుగా చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఏఫ్రిల్ 8వ తేదితో తనకు ఉన్న అనుబంధం గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ తేదీ రామ బంటు హనుమాన్ జయంతి కావడమే ఆ తేదికి గల విశిష్టత. అలాగే హనుమాన్ తో తనకు గల అనుబంధ గురించి ఆయన సంఘటనల వారిగా చెప్పుకుంటూ వస్తున్నారు. కాగా 2002లో బాపు గారు చిరుతో మీకు ఇష్టమైన హనుమాన్ చిత్రాన్ని గీసి ఇస్తాను అని చెప్పారట. ఆ బొమ్మ గీసిన బాపు, చిత్రాన్ని చిరంజీవికి ఇస్తూ బొమ్మ వేసేటప్పుడు మీ పోలికలే గుర్తుకు వచ్చాయండి అన్నారట. చిరు పోలికలతో బాపు గీసిన ఆ బొమ్మను రీక్రియేషన్ చేయించి చిరు తన ఇంటిలోని దేవుడు మందిరం పాలరాతి గోడపై వేయించారట.
ఇక ఈ స్టోరీని చిరు ఇంకా కొనసాగిస్తున్నారు. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ చేస్తున్నారు. సోషల్ అంశాలు కూడిన కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రం తెరకెక్కుతుండగా, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ చిరుకి జంటగా నటిస్తుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
కొన్ని దశాబ్దాల తరవాత, 2002 లో, బాపుగారు నా ఇంట్లో పెట్టుకునేందుకు నాకు ఇష్టమైన ఆంజనేయస్వామిని చిత్రించి పంపుతాను అన్నారు. నేను అది పాలరాతి మీద reproduce చేయించి పూజ గదిలో పెట్టుకున్నాను. ఈ బొమ్మ నాకు ఇచ్చేటప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా …? pic.twitter.com/A2lqoazwcJ
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2020