మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “పెద్ది”. మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా తీసిన ఈ సినిమా భారీ లెవెల్లో విడుదల కాబోతుంది. అయితే ఈ చిత్రం రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కి ఆడియెన్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ పాపులర్ నటుడు, మీర్జాపూర్ సిరీస్ ఫేమ్ మున్నా భయ్యా అలియాస్ దివ్యెందు శర్మ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
అయితే తాను ఈ సినిమా విషయంలో మెయిన్ గా దర్శకుడు బుచ్చుబాబు సానా విషయంలో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. దర్శకుడు బుచ్చిబాబుకి నలుసంతైనా అహం ఉండదని తాను చాలా స్వచ్ఛమైన మనిషి అని చాలా కాలం తర్వాత ఇలాంటి ఒక మనిషిని తాను కలిసాను అని రామ్ చరణ్ లాంటి స్టార్, ఓ భారీ పాన్ ఇండియా దర్శకుణ్ణి నేను అనే భావన తనలో ఎక్కడా ఉండదు.
అతను తనని కలిసినపుడు దాదాపు ఒక ఫ్యాన్ బాయ్ గా నన్ను కలిసాడు అని తనపై చూపించే ప్రేమ, తనతో కలిసి వర్క్ చేయడంపై చూపించిన ఇంట్రెస్ట్ వంటి వాటితో ఈ సినిమా కథ కూడా పూర్తిగా వినకుండా ఓకే చేసేసానని మున్నా భయ్యా చెప్పడం వైరల్ గా మారింది. సో ఈ రకంగా మున్నా భయ్యా ఈ సినిమా ట్రాక్ లోకి వచ్చారని చెప్పొచ్చు.


