ఆది సాయి కుమార్, పాయల్ రాజ్ పుత్ హీరొ హీరోయిన్ లు గా వస్తున్న తాజా చిత్రం కిరాతక. ఎం. వీరభద్రమ్ దర్శకత్వం లో విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3 గా నాగం తిరుపతి రెడ్డి భారీ బడ్జెట్తో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్ట్ తో రానున్న ఈ చిత్రం షూటింగ్ ఆగస్ట్ 13 నుండి ప్రారంభం కానుంది. అయితే నేపథ్యం లో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మాట్లాడుతూ, నేను ఇప్పటివరకు చాలా కథలు విన్నాను, కాని ఈ థ్రిల్లర్ కథ నాకు బాగా నచ్చింది అని అన్నారు. పెర్ఫామెన్స్కి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఆదితో ఫస్ట్ టైమ్ నటిస్తున్నందుకు చాలా ఎగ్జైటింగ్గా ఉందని అన్నారు. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు వీరభద్రమ్గారికి, నిర్మాత నాగం తిరుపతిరెడ్డిగారికి స్పెషల్ థ్యాంక్స్ తెలిపారు.
అయితే నిర్మాత నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ విజన్ సినిమాస్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.3గా కిరాతక చిత్రం రూపొందుతోందనీ అన్నారు. మా హీరో ఆది, దర్శకుడు వీరభద్రమ్గారి హిట్ కాంబినేషన్ లో ఒక పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్ట్తో మేకింగ్లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం అని అన్నారు. వీరభద్రమ్ గారు చెప్పిన కథ బాగా నచ్చి పాయిల్ రాజ్పూత్ హీరోయిన్గా నటిస్తుంది అని అన్నారు. తప్పకుండా కమర్షియల్గా బిగ్ సక్సెస్ సాధిస్తాం అనే నమ్మకం ఉంది అని అన్నారు. త్వరలో గ్రాండ్ ఓపెనింగ్ జరిపి ఆగస్ట్ 13నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం అంటూ చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యం లో చిత్ర దర్శకుడు ఎం.వీరభద్రమ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఆర్టిస్టుల ఎంపిక జరుగుతోంది అని, ఈ చిత్రంలో పూర్ణ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది అని, అలాగే దాసరి అరుణ్ కుమార్ మరియు దేవ్గిల్ కీలక పాత్రలలో నటిస్తున్నారు అని అన్నారు. ఆది ఇంత వరకూ చూడని ఒక సరికొత్త పాత్రలో కనిపించనున్నారు అంటూ సినిమా పై హైప్ క్రియేట్ చేశారు. కిరాతక కథ నచ్చి సింగిల్ సిట్టింగ్లోనే ఈ సినిమాలో నటించడానికి పాయల్ రాజ్పూత్ ఒప్పుకుంది అని అన్నారు. ఆమె క్యారెక్టర్ కూడా ఆడియన్స్ని థ్రిల్ చేస్తుంది అని, భారీ బడ్జెట్తో విజన్ సినిమాస్ బ్యానర్లో నాగం తిరుపతి రెడ్డిగారు అన్కాంప్రమైజ్డ్గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు.