‘ఆర్ఆర్ఆర్’ సాంగ్ పై సుద్దాల అశోక్‌తేజ వివరణ

‘ఆర్ఆర్ఆర్’ సాంగ్ పై సుద్దాల అశోక్‌తేజ వివరణ

Published on Dec 27, 2021 10:00 AM IST

suddala ashok teja

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. విజువల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రానున్న ఈ భారీ చిత్రం పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక, గిరిజనోద్యమ నాయకుడు, గోండు బొబ్బిలి కొమురం భీమ్ పై “కొమురం భీముడో..కొమురం భీముడో…, అర్రాసు నెబుడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో…” అంటూ రిలీజ్ చేసిన ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

కాగా ఈ పాటను రాసిన సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విశేషాలు చెప్పారు. ‘కొమురం భీమ్‌ ని ఆంగ్లేయులు చిత్రహింసలు పెడుతున్న సమయంలో తనకి తానే ధైర్యం చెప్పుకొనే సందర్భంలో ఈ పాట వస్తుంది. ఈ పాట రాయాలని మొదలు పెట్టినప్పుడు.. కొమురం భీమ్‌ ధైర్యాన్ని, అడవి వీరుల వారసత్వాన్ని, కొమురం భీమ్‌ నేపథ్యాన్ని, భయపడని ధీరోధాత్తమైన ఆయన తెగింపును, జీవితాన్ని పదాల రూపంలో రాసే ప్రయత్నం చేశాను’ అంటూ సుద్దాల అశోక్‌తేజ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు