అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున మరియు నాగ చైతన్య నటిస్తున్న ‘మనం’ సినిమా ఈ మధ్య సినీవార్తలలో హాట్ టాపిక్. సమంత మరియు శ్రియ శరన్ హీరోయిన్స్. చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అక్కినేని వంశంలో మూడు తరాల నటులు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో వారి అభిమానులు ఎంతో ఆసక్తిగా సినిమాకోసం ఎదురుచూస్తున్నారు. ఈరోజు మొదలైన షూటింగ్లో సమంత కూడా మిగిలిన బృందంతో కలిసి పాల్గుంది. ‘ఇష్క్’ సినిమా తీసిన విక్రమ్ కుమార్ ఈ సినిమా దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సమాచారం ప్రకారం అక్టోబర్ నెలకల్లా ఈ సినిమా షూటింగ్ ముగించాలని అనుకుంటున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమాకు హర్షవర్ధన్ డైలాగులు అందిస్తున్నాడు. ఈ సినిమా కామెడి ప్రధానంగా సాగుతుంది
మూడు తరాల సినిమా మొదలైంది
మూడు తరాల సినిమా మొదలైంది
Published on Jun 7, 2013 7:00 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- లేటెస్ట్…గూస్ బంప్స్ తెప్పిస్తున్న “పుష్ప పుష్ప” సాంగ్!
- ఓ రేంజ్ హైప్ ఇస్తున్న “పుష్ప 2 ది రూల్” ఫస్ట్ సింగిల్ లేటెస్ట్ పోస్టర్!
- “లవ్ టుడే” హీరో నెక్స్ట్ మూవీ అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్!
- సర్ప్రైజింగ్ : ఈ 14 భాషల్లో ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “హీరామండి”
- రజినీ “కూలీ”.. మేకర్స్ కి షాకిచ్చిన ఇళయరాజా
- వైరల్ పిక్ : ప్రచారంలో స్వాగ్ తో అదరగొట్టేసిన బాలయ్య
- తారక్, నీల్ భారీ ప్రాజెక్ట్ పై సాలిడ్ అప్డేట్