గత కొన్నాళ్ల నుంచి కోలీవుడ్ లో ఓ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ కోసమే చర్చ నడుస్తోంది. అదే లెజెండరీ దర్శకుడు మణిరత్నం, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నాచురల్ బ్యూటీ సాయి పల్లవి కాంబినేషన్ అని చెప్పాలి. వీరి కలయికలో సినిమా కోసం ఇన్ని రోజులు అనధికారికంగా వినిపించిన వార్తలు ఇప్పుడు ఫైనల్ గా నిజం అయ్యాయి. మేకర్స్ ఈ క్రేజీ కలయికలో సినిమా ఉందని అఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో అభిమానుల్లో మంచి ఉత్కంఠ నెలకొంది.
ఇక ఈ సినిమాని మద్రాస్ టాకీస్ వారు అలాగే లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నట్లు ఖరారు చేసారు. మరి ఈ విలక్షణ కాంబినేషన్ నుంచి ఈ తరహా సినిమా వస్తుంది అనేది వేచి చూడాల్సిందే. ఇటీవల మణిరత్నం నుంచి వచ్చిన థగ్ లైఫ్ దారుణంగా డిజప్పాయింట్ చేసింది. సో ఈ సినిమా అయినా మెప్పిస్తుందో లేదో చూడాలి.


