RRR: ఒక్క పాట కోసం రూ.3 కోట్లు?

RRR: ఒక్క పాట కోసం రూ.3 కోట్లు?

Published on Jul 14, 2021 11:47 PM IST

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా కలిసి నటిస్తున్న చిత్రం “రౌద్రం రణం రుధిరం”. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే రెండు పాటలు మినహా షూటింగ్‌ మొత్తం పూర్తి చేసుకుని ప్రచార కార్యక్రమాల్లో బిజీగా అయ్యేందుకు చిత్ర బృందం రెడీ అయ్యింది.

అయితే తాజాగా ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఈ సినిమాలో కేవలం ఒక్క పాట కోసం ఏకంగా రూ.3కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారట. ఈ పాటలో అలియా భట్ సందడి చేయనున్నట్టు తెలుస్తుంది. కాస్ట్యూమ్స్‌ కోసమే దాదాపు రూ.కోటి వరకు ఖర్చు చేయనున్నట్టు టాక్ వినిపిస్తుంది. రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఈ పాటను చిత్రీకరించనున్నారట. అయితే దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి రేపు ఉదయం 11 గంటలకు మేకింగ్ వీడియోని వదలబోతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు