పూర్తి కావస్తున్న అధినాయకుడు

పూర్తి కావస్తున్న అధినాయకుడు

Published on Nov 24, 2011 8:35 AM IST

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తదుపరి చిత్రం ‘అధినాయకుడు’. ఎం.ఎల్. కుమార్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కి విడుదల కానుంది. ఈ చిత్రం లో బాలయ్య బాబు మూడు వేషాలలో కనపడనున్నారు. సలోని మరియు లక్ష్మీ రాయి ఈ చిత్రం లో ప్రధాన హీరోఇన్లు. ఈ నెల 26 నుండి బాలకృష్ణ మరియు లక్ష్మీ రాయి ల మీద హైదరాబాద్ లో ఒక పాత చిత్రీకరించనున్నారు.

రుచూరి మురళి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, కళ్యాణి మాలిక్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. బాలకృష్ణ వేసిన పెద్దాయన వేషం మంచి హైలైట్ అవుతుందని దర్శకులు చెబుతున్నారు. సంక్రాంతి పండుగ బాలకృష్ణ కు బాగా కలిసొచ్చిన పండుగ. అందుకే ఈ సరి అధినాయకుడి మీద ఫాన్స్ లో మంచి ఆశలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు