ప్రభాస్ ఫ్యాన్స్ కి బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఆహా టీమ్

ప్రభాస్ ఫ్యాన్స్ కి బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఆహా టీమ్

Published on Dec 28, 2022 8:05 PM IST

ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహాలో ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ప్రసారం అవుతున్న క్రేజీ ఎంటర్టైనర్ షో అన్ స్టాపబుల్ సీజన్ 2. ఇప్పటికే పలు ఎపిసోడ్స్ ఎంతో సక్సెస్ఫుల్ గా ఆడియన్స్ అందరి ఆదరణ తో పూర్తి చేసుకున్న ఈ షోకి ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, యాక్షన్ హీరో గోపీచంద్ ఇద్దరూ కూడా గెస్టులుగా విచ్చేసి పార్టిసిపేట్ చేసిన సంగతి తెలిసిందే. ఎంతో గ్రాండ్ గా చిత్రీకరించబడ్డ ఈ ఎపిసోడ్ యొక్క ప్రోమో ఇటీవల రిలీజ్ అయి వ్యూస్ పరంగా పెద్ద రికార్డు కూడా అందుకుంది. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ ఎపిసోడ్ ని న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 30 న ప్రసారం చేయనున్నట్లు ఇటీవల ఆహా వారు ప్రకటించారు.

అయితే కొద్దిసేపటి క్రితం ప్రభాస్, గోపీచంద్ ఎపిసోడ్ పై తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక కీలక పోస్ట్ చేసారు ఆహా టీమ్. ప్రభాస్, గోపీచంద్ ల క్రేజీ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా ప్రసారం చేయనున్నామని, అలానే అందులో మొదటి భాగాన్ని గతంలో ప్రకటించిన విధంగానే డిసెంబర్ 30న (బాహుబలి ది బిగినింగ్) , అలానే రెండవ ఎపిసోడ్ ని జనవరి 6న (బాహుబలి ది కన్ క్లూజన్) గా ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. ఇది ఒకరకంగా ప్రభాస్ ఫ్యాన్స్ కి బిగ్ ట్విస్ట్ అని, మొత్తంగా అందరిలో మొదటి నుండి ఎంతో ఆసక్తిని ఏర్పరిచిన ఈ స్పెషల్ ఎపిసోడ్ ఎంత మేర ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని ఆకట్టుకుని వ్యూస్ రాబడుతుందో చూడాలని అంటున్నారు సినీ విశ్లేషకులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు