అజిత్ 59 రీమేకే !

అజిత్ 59 రీమేకే !

Published on Nov 9, 2018 3:00 PM IST

స్టార్ హీరో తల అజిత్ నటించనున్న 59 వ చిత్రం రీమేకే అని కన్ఫర్మ్ అయ్యింది. బాలీవుడ్ లో విమర్శకులు ప్రశంసలు పొందిన సూపర్ హిట్ మూవీ ‘పింక్’ కు రీమేక్ గా రానుంది ఈ చిత్రం. ప్రముఖ హిందీ నిర్మాత బోనీ కపూర్ , జీ స్టూడియోస్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

‘శతురంగ వెట్టై , తీరం అడిగారా ఒండ్రు’ చిత్రాల దర్శకుడు హెచ్ వినోత్ ఈచిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో అజిత్ , అమితాబ్ బచ్చన్ పాత్రలో నటించనున్నాడు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇక ఈ చిత్రం తరువాత అజిత్ – హెచ్ వినోత్ కాంబినేషన్లో మరో చిత్రం కూడా తెరకెక్కనుందట.

ఇక అజిత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో ‘విశ్వాసం’ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈచిత్రం చివరి షెడ్యూల్ లో వుంది. వచ్చే ఏడాది జనవరిలో పొంగల్ కు ఈచిత్రం విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు