‘అఖిల్’కి హీరోయిన్ బాధ ఇంకా తీరలేదు !

‘అఖిల్’కి హీరోయిన్ బాధ ఇంకా తీరలేదు !

Published on Jun 19, 2019 3:00 AM IST

‘మిస్టర్ మజ్ను’ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది అక్కినేని అఖిల్ కి. దాంతో తన తరువాత సినిమా పై మరింత జాగ్రత్త పడుతున్నాడు అఖిల్. కాగా తన తర్వాత సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కాస్టింగ్ ఫిక్స్ అయింది. ఈ నెల 26 నుంచి షెడ్యూలు కూడా వేసారు. కానీ ఇంకా హీరోయిన్ మాత్రం ఫైనల్ కాలేదు. కొంతమంది పేరు ఉన్న హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నారు. అలాగే కొత్త అమ్మాయిలను కూడా చూస్తున్నారు. కానీ ఇంకా ఎవ్వరూ సెట్ కాలేదు.

అయితే ఫస్ట్ షెడ్యూల్ కి హీరోయిన్ తో పనిలేదు కాబట్టి, సమస్య లేదు.మరి ఫస్ట్ షెడ్యూల్ ముగిసే సరికి హీరోయిన్ ను ఫైనల్ చేయాల్సి ఉంది. ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నే నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్నారు. మరి భాస్కర్ తో చెయ్యబోయే సినిమాతోనైనా అఖిల్ భారీ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు