మైత్రీ నిర్మాణంలో అఖిల్ కొత్త లవ్ స్టోరీ ?

మైత్రీ నిర్మాణంలో అఖిల్ కొత్త లవ్ స్టోరీ ?

Published on Jun 12, 2021 10:09 PM IST

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ అంటూ అక్కినేని అఖిల్ – పూజా హెగ్డే కలయికలో వస్తోన్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అఖిల్ సినిమాకి సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త ఒకటి వినిపిస్తుంది. అఖిల్ మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మాణంలో ఒక లవ్ స్టోరీ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. అయితే, ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరనే విషయం పై మాత్రం ఇంకా క్లారిటీ లేదు.

ఇక ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. కాగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో లవ్ ట్రాక్ చాల బాగా వచ్చిందని.. ముఖ్యంగా లవ్ సీన్స్ లో అఖిల్ – పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాల బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ కూడా సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని తెలుస్తోంది. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాను బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా అఖిల్ కెరీర్ కి కీలకం కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు