అమ్ముడైపోయిన ‘అల వైకుంఠపురం’లో శాటిలైట్, డిజిటల్ రైట్స్

అమ్ముడైపోయిన ‘అల వైకుంఠపురం’లో శాటిలైట్, డిజిటల్ రైట్స్

Published on Sep 4, 2019 7:36 PM IST

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలయికలో రూపొందుతున్న హ్యాట్రిక్ చిత్రం ‘అల వైకుంఠపురం’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. వీరి కాంబినేషన్లో వచ్చిన గత చిత్రాలు ‘జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి’ భారీ విజయాలుగా నిలవడంతో ట్రేడ్ వర్గాల్లో కూడా సినిమా హక్కుల కోసం గట్టి పోటీ నెలకొంది. చాలా మంది హక్కుల దక్కించుకోవడం కోసం పెద్ద మొత్తం వెచ్చించటానికి సిద్దమయ్యారు.

తాజా సమాచారం మేరకు ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని సన్ నెక్స్ట్ సంస్థ దక్కించుకోగా శాటిలైట్ హక్కుల్ని జెమినీ టీవీ సొంతం చేసుకుంది. ఈ రెండు సంస్థలు కూడా రైట్స్ కోసం భారీ ఎమౌంట్ వెచ్చించాయని ఫిల్మ్ నగర్ టాక్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు.

ఇందులో బన్నీ సరసన పూజా హెగ్డే కథానాయిక కాగా టబు, సుశాంత్, నివేత పేతురాజ్, జయరామ్ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు