మరో సెన్సేషనల్ మార్క్ అందుకున్న “వైకుంఠపురములో” ఆల్బమ్.!

మరో సెన్సేషనల్ మార్క్ అందుకున్న “వైకుంఠపురములో” ఆల్బమ్.!

Published on Apr 17, 2021 7:08 AM IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “అల వైకుంఠపురములో”. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గత ఏడాది ఎంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. అలాగే ఈ చిత్రం ఇంత ఘన విజయం సాధించడానికి సంగీత దర్శకుడు థమన్ ఇచ్చిన సంగీతం కూడా ఎంత పెద్ద ఎస్సెస్ట్ అయ్యిందో కూడా తెలుసు. మన తెలుగు సినిమాలో ఇప్పటి వరకు ఏ దాని ఆల్బమ్ కు కూడా రాని స్పందన అల వైకుంఠపురములో ఆల్బమ్ కు వచ్చింది.

ప్రతీ పాట కూడా యూట్యూబ్ లో భారీ వ్యూస్ తో రికార్డులు కొల్లగొట్టినవే.. అలా అన్ని పాటలు కలిపి ఈ ఆల్బమ్ ఇప్పుడు 2 బిలియన్ వ్యూస్ మార్క్ ను క్రాస్ చేసి మన దక్షిణాది సినిమాలో ఫస్ట్ ఎవర్ రికార్డ్ ను సెట్ చేసినట్టు తెలుస్తోంది.. మొత్తానికి మాత్రం త్రివిక్రమ్ థమన్ బన్నీ ల కాంబో ఓ చరిత్రలోనే సృష్టించారని చెప్పాలి.. ఇక ఇప్పుడు రాబోతున్న మరో బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ కాంబో బన్నీ – దేవి – సుకుమార్ ల “పుష్ప” ఆల్బమ్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు