హిందీలో బాగా పాపులర్ అయిన మాస్టర్ చెఫ్ వంటల ప్రోగ్రామ్ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. తమిళ వెర్షన్కు హీరో విజయ్ సేతుపతి, కన్నడలో కిచ్చ సుదీప్ హోస్ట్గా వ్యవహరిస్తుండగా, తెలుగుకు తమన్నా హోస్ట్గా వ్యవహరిస్తుంది. ప్రస్తుతం తెలుగు వెర్షన్కి సంబంధించి షూటింగ్ జరుగుతుంది. అయితే తెలుగులో ఈ కార్యక్రమానికి ఫస్ట్ సెలబ్రెటీ గెస్ట్గా అల్లు శిరీష్ హాజరయ్యారు.
అయితే ఈ విషయాన్ని శిరీష్ తన ఇన్స్టా స్టోరీ ద్వారా వెల్లడిస్తూ తమన్నాతో కలిసి మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్లో భాగం అయినందుకు చాలా ఎగ్జైటింగ్గా ఉందని, ఈ కార్యక్రమంలో తాను ఫస్ట్ సెలబ్రెటీ గెస్ట్ అయినందకు చాలా హ్యాపీగా ఉందని, షూటింగ్ పూర్తయ్యిందని, త్వరలోనే ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ కానుందని చెప్పుకొచ్చాడు.