క్షీర సాగర మథనం సారం అదే – అనిల్ పంగులూరి

క్షీర సాగర మథనం సారం అదే – అనిల్ పంగులూరి

Published on Aug 5, 2021 12:00 PM IST

అవాంతరాల హాలాహలం అనంతరమే ఆనందం అనే అమృతం అన్నదే క్షీరసాగర మథనం చిత్రం సారం అంటూ దర్శకుడు అనిల్ పంగులూరి తెలిపారు. ఐరావతం, కామధేను, కల్పవృక్షం వంటివాటితో సరిపెట్టుకున్నా, హాలాహలం ఉద్భవించినప్పుడు భయపడి ఆగిపోయినా, అమృతం ఆవిర్భవించేది కాదు అని, కష్టాలకు భయపడి ఆగిపోతే జీవన మకరందాన్ని ఆస్వాదించలేమని, జీవితంలో ఏమీ సాదించలేమన్నదే మా క్షీర సాగర మథనం కథా సారాంశం అని అంటున్నారు సాఫ్ట్ వేర్ రంగం నుంచి సినీ రంగంలో దర్శకుడుగా అరంగేట్రం చేస్తున్న బహుముఖ ప్రతిభాశాలి అనిల్ పంగులూరి.

అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన పలు సాఫ్ట్వేర్ సంస్థల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న ఓ ఇరవై మంది మిత్రుల ప్రోత్సాహంతో అనిల్ పంగులూరి తెరకెక్కించిన ఈ క్షీర సాగర మథనం రేపు (ఆగస్టు 6) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ కి సీక్వెల్ లాంటి ఈ చిత్రం సాఫ్ట్వేర్ వాళ్లనే కాకుండా, సెన్సిబిలిటీస్ ఉన్న ప్రతి ఒక్కరినీ అమితంగా ఆకట్టుకుంటుందని అనిల్ అంటున్నారు. ఈ చిత్రం చూసి, ఎంతగానో మెచ్చిన స్టార్ ప్రొడ్యూసర్ శరత్ మరార్ తనకు నైతికంగా ఎంతో మద్దతు ఇచ్చారని, ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని తెలిపారు. ఏడు పాత్రల తాలూకు భావోద్వేగ సంఘర్షణల మధనమే క్షీర సాగర మథనం అంటున్నారు. ఈ చిత్ర విజయంపై ఎంతో ధీమాగా ఉన్న ఈ ఒంగోలు వాసి, తన తదుపరి చిత్రం కోసం ఇప్పటికే కధ కథనాలు సిద్ధం చేసుకోవడంతో పాటు, ప్రి ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకోవడం విశేషం.

అయితే మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో అక్షత సోనావని హీరోయిన్ కాగా ప్రదీప్ రుద్ర ప్రతినాయకుడు. శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు