టీమిండియా స్టార్ పేసర్ ఝులన్ గోస్వామి అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ మహిళా క్రికెట్ పేస్ దళపతి లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో తన చివరి మ్యాచ్ ను ఆడింది. ఝులన్ గోస్వామి రిటైర్మెంట్ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఝులన్ గోస్వామి పై పొగడ్తల వర్షం కురిపిస్తూ ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది.
ఇంతకీ, అనుష్క శర్మ పోస్ట్ లో ఏం రాసిందంటే.. ‘ఝులన్ గోస్వామి ఒక స్ఫూర్తి.. ఒక లెజెండ్, రోల్ మోడల్. ఝులన్ గోస్వామి.. మీ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. టీమిండియా గేమ్ ఛేంజర్గా నిలిచినందుకు మీకు చాలా ధన్యవాదాలు..’ అంటూ అనుష్క శర్మ పోస్ట్ పెట్టింది. అలాగే, అనుష్క శర్మ ‘చక్దా ఎక్స్ప్రెస్’లో ఝులన్ గోస్వామి పాత్రలో నటించబోతుంది. ఏది ఏమైనా భారత మహిళల క్రికెట్లో గేమ్ ఛేంజర్ గా ఝులన్ గోస్వామి మంచి పేరు ఉంది.