యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరెకెక్కిన్న చిత్రం ‘సాహో’. కాగా అగష్టు 30న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్స్ ను నిర్వహిస్తోంది. కాగా ఈ చిత్రానికి రోజుకి ఆరు ఆటలు ఆడేలా పర్మిషన్ ఇప్పించాలని ఈ చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. ఏపీ ప్రభుత్వం ఆరు ఆటలు ప్రదర్శించేందుకు అనుమతి ఇస్తూ ఒక జివోని కూడా రిలీజ్ చేసింది. పైగా టికెట్ రేట్లను పెంచుకునేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించింది.
ఇక సాహో టీమ్ అదనపు షోస్ కోసం, టిక్కెట్ ధర పెంపు కోసం తెలంగాణ ప్రభుత్వానికి కూడా వినతి పత్రం అందించిన సంగతి తెలిసిందే. అయితే దీని పై తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటిస్తోంది. అలాగే ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, నీల్ నితిన్, అరుణ్ విజయ్, మందిరా బేడీ, మురళి శర్మ, వెన్నెల కిషోర్ ఇతర కీలకపాత్రలుగా చేస్తున్నారు. టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రాన్ ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో టాలీవుడ్ ప్రేస్టేజియస్ ప్రోడక్షన్ హౌస్ యువి క్రియెషన్స్ బ్యానర్ లో వంశి, ప్రమెద్, విక్రమ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.