సరిలేరు నీకెవ్వరు మైండ్ బ్లాకింగ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.

సరిలేరు నీకెవ్వరు మైండ్ బ్లాకింగ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.

Published on Jan 18, 2020 11:07 AM IST

సరిలేరు నీకెవ్వరు వసూళ్ల జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు. పండుగ ముగిసిన తరువాత కూడా ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో విశేష ఆదరణ దక్కించుకుంటుంది. పండుగ సీజన్ కి వచ్చిన పర్ఫెక్ట్ మూవీగా సరిలేరు నీకెవ్వరు నిలిచింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో సరిలేరు నీకెవ్వరు మొదటి వారం సాధించిన వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. నైజాం లో ఈ చిత్రం మొదటివారం ముగిసే నాటికి 27.7 కోట్ల షేర్ రాబట్టింది. ఈ చిత్రం మహేష్ కెరీర్ లో హైయెస్ట్ నైజాం కలెక్షన్స్ సాధించిన మహర్షి మూవీని దాటివేయడం ఖాయంగా కనిపిస్తుంది.

ఇక సీడెడ్ లో 12.4 కోట్లు, గుంటూరులో 8.16 కోట్లు, కృష్ణ 6.87 కోట్ల షేర్ వసూలు చేసింది. కొన్ని ఏరియాలలో సరిలేరు నీకెవ్వరు బ్రేక్ ఈవెన్ కి చేరుకుంది. దర్శకుడు అనిల్ రావిపూడి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈచిత్రాన్ని తెరకెక్కించారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటించగా దిల్ రాజు సమర్పణలో రామ బ్రహ్మం సుంకర నిర్మించారు. దేవిశ్రీ సంగీతం అందించారు.

ప్రాంతాల వారీగా మొదటివారం ఏపీ/తెలంగాణా కలెక్షన్స్ వివరాలు…
నైజాం – 27.7 కోట్లు
సీడెడ్ – 12.4 కోట్లు
ఉత్తరాంధ్ర – 13.5 కోట్లు
గుంటూరు – 8.16 కోట్లు
ఈస్ట్ – 8.19 కోట్లు
వెస్ట్ – 5.61 కోట్లు
కృష్ణ – 6.87 కోట్లు
నెల్లూరు – 3.13 కోట్లు

మొత్తం 7 రోజులకు రూ. 85.56 కోట్ల షేర్

సంబంధిత సమాచారం

తాజా వార్తలు