కనుమ రోజు వసూళ్లు ఇరగొట్టిన మహేష్.

కనుమ రోజు వసూళ్లు ఇరగొట్టిన మహేష్.

Published on Jan 17, 2020 9:02 AM IST

సరిలేరు నీకెవ్వరు పండుగ చివరిదినం కనుమ రోజు కూడా వసూళ్ల పరంపర కొనసాగించింది. మొదటిరోజే రికార్డ్ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో విశేష ఆదరణ దక్కించుకుంటుంది. పండుగ సీజన్ కి వచ్చిన పర్ఫెక్ట్ మూవీగా సరిలేరు నీకెవ్వరు నిలిచింది. విడుదలైన ఆరు రోజులకు కూడా అనేక చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి . ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో సరిలేరు నీకెవ్వరు వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. నైజాం లో ఈ చిత్రం ఆరు రోజులకు 25.65 కోట్ల షేర్ రాబట్టింది. వీకెండ్ ముగిసేనాటికి మహేష్ కెరీర్ లో హైయెస్ట్ నైజాం కలెక్షన్స్ సాధించిన మహర్షి మూవీని దాటివేయడం ఖాయంగా కనిపిస్తుంది.

ఇక సీడెడ్ లో 11.35 కోట్లు, గుంటూరులో 7.72 కోట్లు, కృష్ణ 6.27 కోట్ల షేర్ వసూలు చేసింది. కొన్ని ఏరియాలో సరిలేరు నీకెవ్వరు బ్రేక్ ఈవెన్ కి చేరుకుంది. దర్శకుడు అనిల్ రావిపూడి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈచిత్రాన్ని తెరకెక్కించారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటించగా దిల్ రాజు సమర్పణలో రామ బ్రహ్మం సుంకర నిర్మించారు. దేవిశ్రీ సంగీతం అందించారు.

ప్రాంతాల వారీగా ఏపీ/తెలంగాణా కలెక్షన్స్ వివరాలు…
నైజాం – 25.65 కోట్లు
సీడెడ్ – 11.35 కోట్లు
ఉత్తరాంధ్ర – 11.08 కోట్లు
గుంటూరు – 7.72 కోట్లు
ఈస్ట్ – 7.23 కోట్లు
వెస్ట్ – 5.06 కోట్లు
కృష్ణ – 6.27 కోట్లు
నెల్లూరు – 2.86 కోట్లు

మొత్తం ఆరు రోజులకు రూ. 77.94 కోట్ల షేర్

సంబంధిత సమాచారం

తాజా వార్తలు