అర్జున్ రెడ్డి సినిమాకు హిందీ రీమేక్గా వచ్చిన “కబీర్ సింగ్” బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వరదకు ఇప్పట్లో బ్రేక్ పడేలా కనిపించడం లేదు.ఈ శుక్రవారం ఆయుష్మాన్ ఖురానా నటించిన “ఆర్టికల్15”,అలాగే మరో చిత్రం “హమ్ తుమ్ సే ప్యార్ కిట్న” అనే రెండు చిత్రాలు విడుదలయాయి. ఐనాకూడా ఈ మూవీ రెండో వారంలో ఇప్పటివరకూ రూ 163.73 కోట్లు రాబట్టిందని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు .
కేసరి, టోటల్ ఢమాల్ల లైఫ్టైమ్ వసూళ్లను అధిగమించి ఈ ఏడాది టాప్ 5 హయ్యస్ట్ గ్రాసర్స్లో మూడో స్ధానంలో నిలిచింది. రూ 150 కోట్ల మార్క్ను దాటిన కబీర్ సింగ్ ఆదివారం రూ 175 కోట్ల వసూళ్ల మైలురాయిని అధిగమించి రెండో వారంలో పద్మావత్ కంటే మెరుగైన వసూళ్లు రాబడుతోందని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. కబీర్ సింగ్ త్వరలో భారత్, ఉరి మూవీల లైఫ్టైమ్ బిజినెస్ను దాటుతుందని తరణ్ ఆదర్శ్ అంచనా వేశారు.
#KabirSingh crosses ₹ 150 cr… Will cross ₹ 175 cr today [Day 10]… Now third highest grosser of 2019, surpassing *lifetime biz* of #Kesari and #TotalDhamaal… Trending better than #Padmaavat in Week 2… [Week 2] Fri 12.21 cr, Sat 17.10 cr. Total: ₹ 163.73 cr. India biz.
— taran adarsh (@taran_adarsh) June 30, 2019