హీరో శర్వానంద్ – శ్రీను వైట్ల కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో సీనియర్ హీరో అరవింద్ స్వామి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఐతే, అరవింద్ స్వామి పాత్రతో పాటు సినిమాలో మరో స్పెషల్ పాత్ర కూడా ఉంటుందని.. ఇది నెగిటివ్ పాత్ర అని, ఈ నెగిటివ్ పాత్రలో మరో సీనియర్ హీరో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ‘మ్యాడ్’, ‘8 వసంతాలు’ ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి.
అన్నట్టు శర్వానంద్ ఈ సినిమా కోసం తన లుక్ ను మళ్లీ కొత్తగా ట్రై చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఐతే, గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ‘విశ్వం’ ఏవరేజ్ గా నిలిచింది. దీంతో, ఎలాగైనా మళ్ళీ టాలీవుడ్ లో తన తర్వాత సినిమాతో బిజీ అయ్యేందుకు శ్రీనువైట్ల తెగ కష్ట పడుతున్నాడు. కాగా ఈ సినిమాలో మరో సీనియర్ హీరో కూడా కనిపిస్తాడని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది.


