త్వరలో మర్కెట్లోకి రానున్న రాజన్న ఆడియో

త్వరలో మర్కెట్లోకి రానున్న రాజన్న ఆడియో

Published on Nov 22, 2011 2:07 PM IST


అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రాజన్న’ . విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలకి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. నాగార్జున సరసన స్నేహ నటించింది.విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూర్చిన ఈ చిత్ర ఆడియోను నవంబరు 26 న ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం శబ్దాలయ స్టూడియోస్ లో డీటీఎస్ పనులు జరుపుకుంటుంది. డిసెంబరు నాలుగవ వారంలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు