దసరాకి బాలయ్య అఖండ ఫిక్స్ ?

దసరాకి బాలయ్య అఖండ ఫిక్స్ ?

Published on Jun 6, 2021 10:50 PM IST

బాలయ్య బాబు హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రానున్న అఖండ సినిమా‌ను దసరాకి రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఇప్పటివరకు అయితే మేకర్స్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమా కోసమైతే నంద‌మూరి అభిమానులు ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఇంకా ఒక షెడ్యూల్ షూటింగ్ జరుకోవాల్సి ఉంది. ఇక ఈ సినిమా టీజర్ కి 50 మిలియన్ల వ్యూస్ రావడంతో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

ఏది ఏమైనా బోయపాటి, బాలయ్య సినిమా అంటే కచ్చితంగా అదిరిపోయే యాక్షన్ ఉండాలని బాలయ్య ఫ్యాన్స్ కూడా బలంగా కోరుకుంటారు. అందుకే ఈ సినిమా యాక్షన్ విషయంలో చాలా రకాలుగా ఆలోచించి ఫైట్స్ ను కంపోజ్ చేశారు రామ్ లక్ష్మణ్ మాస్టర్లు. ఇక ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్ మెయిన్ హీరోయిన్. ఇక ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు