వివాదాస్పదమైన ప్రముఖ హీరో ఫోటో !

వివాదాస్పదమైన ప్రముఖ హీరో ఫోటో !

Published on Sep 25, 2018 3:48 PM IST

నూతన దర్శకుడు శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే శరవేగంగా షూటింగ్ జరుపుకుంది ఈ చిత్రం. అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ – తేజ కాంబినేషన్ లో కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ గా ఓ సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్‌ ప్రస్తుతం థాయ్ లాండ్‌లో జరుగుతోంది. శ్రీనివాస్ షూటింగ్ సమయంలో తీసుకున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

కాగా ఇప్పుడు ఆ ఫోటో వివాదాస్పదం అయింది. శ్రీనివాస్ సరదాగా ఏనుగు దంతాల పై కూర్చొని ఫోటో దిగటం, అది సోషల్‌ మీడియాలో పోస్ట్ చెయ్యటం, వైరల్ అవ్వటం, అది కాస్త వివాదాస్పదం అవ్వటం.. చకచకా జరిగిపోయాయి. తమ సరదా కోసం ఓ మూగజీవి దంతాల మీద కూర్చొవటం అంటే.. ఆ జీవిని దారుణంగా హింసించడమే అని జంతు ప్రేమికులు తెగ సీరియస్ అవుతున్నారు. దాంతో శ్రీనివాస్‌ పోస్ట్ చేసిన ఆ ఫోటోను తన ట్విటర్‌ నుంచి తొలగించాడు. అయినప్పటికీ ఈ ఫోటో వివాదం మాత్రం ఇంకా సద్దుమణగట్లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు