చిరు చూపు మళ్లీ బాలీవుడ్ వైపే ?

చిరు చూపు మళ్లీ బాలీవుడ్ వైపే ?

Published on Oct 21, 2019 11:54 AM IST

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివల చిత్రం వచ్చే నెలలోనే సెట్స్ మీదికి వెళ్లనుంది. మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. మొదటి నుండి ఈ సినిమా సంగీత దర్శకుడి విషయంలో సందిగ్ధత నడుస్తోంది. తన ప్రతి సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ చేత మ్యూజిక్ చేయించుకున్న కొరటాల ఈసారి బలంగా మార్పు కోరుకుంటున్నారట.

అంతేకాదు చిరు సైతం బాలీవుడ్ సంగీత ద్వయం అజయ్, అతుల్ పట్ల ఆసక్తిగా ఉన్నారట. ఈ ఇద్దరు ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్, జీరో’ సినిమాలకు మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించి ఆకట్టుకున్నారు. వీరైతే తమ సినిమాకు బాగుంటుందని చిరు భావిస్తున్నారట. ఇప్పటికే చర్చలు మొదలయ్యాని, త్వరలో ఫైనల్ క్లారిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇకపోతే రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరుకి జోడీగా త్రిష నటించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల టాక్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు