‘బ్రాండ్ బాబు’ పాటకు కీరవాణి బ్రాండ్ పడింది !

‘బ్రాండ్ బాబు’ పాటకు కీరవాణి బ్రాండ్ పడింది !

Published on Jul 17, 2018 10:52 AM IST


యాంకర్ ప్రభాకర్ దర్శకత్వంలో సుమంత్ శైలేంద్ర హీరోగా ‘బ్రాండ్ బాబు’ అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆగస్ట్ మొదటివారంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది. కాగా ఈ బ్రాండ్ బాబు మొదటి పాటకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్రాండ్ పడింది. ‘వెన్నెలమ్మ వేంచేసినా.. నిండుపున్నమే పూసెనా..’ అనే పాటను కీరవాణి తన చేతుల మీదుగా విడుదల చేసి ‘బ్రాండ్ బాబు’కు తన వంతు సహకారం అందించారు.

ఇక ఈ చిత్రంలో సుమంత్ శైలేంద్ర సరసన ఈషా రెబ్బా కథానాయకిగా నటిస్తోంది. ప్రముఖ నటుడు ముర‌ళీశ‌ర్మ ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో కనిపించబోతున్నారు. దర్శకుడు మారుతీ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. జే.బీ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ పళని కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యస్ శైలేంద్ర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఐతే ఈ చిత్రం మారుతి చిత్రాల శైలిలోనే సాగుతుందని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రం తెరకెక్కిందని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు