పవన్ – సాయి తేజ్ ల ‘బ్రో’ నుండి రేపు క్రేజీ అప్ డేట్

పవన్ – సాయి తేజ్ ల ‘బ్రో’ నుండి రేపు క్రేజీ అప్ డేట్

Published on May 27, 2023 10:12 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ ల కలయికలో తెరకెక్కున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ బ్రో. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంస్థల పై గ్రాండ్ లెవెల్లో నిర్మితం అవుతున్న ఈ మూవీ ఆల్మోస్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తమిళ మూవీ వినోదయ సిత్తం కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా ఇటీవల రిలీజ్ అయిన పవన్ , సాయి తేజ్ ల ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి అందరి నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.

కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, రాజా చెంబోలు తదితరులు కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీ నుండి రేపు ఉదయం 10 గం. 08 ని. లకు ఒక క్రేజీ అప్ డేట్ రానున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ ప్రకటించారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు కలిగిన ఈ మూవీ జులై 28న ప్రేక్షకాభిమానుల ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు