ముగ్గురు హీరోయిన్సుతో రొమాన్స్ చేయనున్న మహేష్

ముగ్గురు హీరోయిన్సుతో రొమాన్స్ చేయనున్న మహేష్

Published on Nov 23, 2011 9:50 AM IST


మహేష్ బాబు నటించబోయే మరో చిత్రం ఏప్రిల్ 9 , 2012 న ప్రారంభం కానుంది.క్రిష్ దర్శకత్వంలో అశ్విని దత్ నిర్మించబోయే ఈ చిత్రంలో మహేష్ సరసన ముగ్గురు హీరోయిన్స్ నటించనున్నారు. ఈ చిత్రానికి ఎం.ఎం,కీరవాణి సంగీతం అందించనున్నాడు. దూకుడు విజయం తరువాత మహేష్ చాలా వేగంగా సినిమాలు పూర్తి చేయడానికి సిద్ధం అయ్యారు.
‘బిజినెస్ మాన్’ సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతుంది.

ఇవే కాకుండా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో ఒకటి, దిల్ రాజు నిర్మాణంలో వెంకటేష్ తో నటించనున్న మల్టీ స్టారర్ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాలు చేయనున్నారు. ఇంతకుముందు అశ్విని దత్ గారు మహేష్ బాబుతో ‘రాజ కుమారుడు’ మరియు ‘సైనికుడు’ చిత్రాలు నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు