ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ మేన్ మానియా

ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ మేన్ మానియా

Published on Jan 13, 2012 8:10 AM IST


ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ‘బిజినెస్ మేన్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ రోజే భారీగా విడుదల కాబోతుంది. ఈ చిత్రం చాలా థియేటర్లలో విడుదలై రికార్డులు సృష్టించడానికి సిద్ధమవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజే విడుదలవుతుండగా అన్ని థియేటర్లలో టికెట్లు అమ్ముడుపోయాయి.సంక్రాంతి సెలవులు కూడా ఈ చిత్రానికి కూడా బాగా కలిసి వచ్చాయి. ఇదే అదునుగా బ్లాక్ టికెట్ రాయుళ్ళు రెచ్చిపోతున్నారు. ఇప్పటివరకు విదేశాలలో షోస్ పూర్తవగా  పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సంక్రాంతి సీజన్ మహేష్ మరియు వెంకటేష్ కి బాగా కలిసి వచ్చింది. బిజినెస్ మేన్ కి పూరీ జగన్నాధ్ డైరెక్ట్ చేయగా కాజల్ హీరోయిన్. తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి సమాచారం 123తెలుగు.కామ్ లో ప్రత్యేకంగా అందిస్తుంటాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు