బజ్ : మరోసారి రిపీట్ కానున్న ‘నా సామిరంగ’ కాంబో ?

బజ్ : మరోసారి రిపీట్ కానున్న ‘నా సామిరంగ’ కాంబో ?

Published on Apr 30, 2024 2:08 AM IST

కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా కొత్త దర్శకుడు విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ నా సామిరంగ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం అందుకుంది. ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటించిన ఈమూవీలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించారు. ఇక ప్రస్తుతం ధనుష్ తో కలిసి శేఖర్ కమ్ముల తీస్తున్న కుబేర మూవీలో ప్రధాన పాత్ర చేస్తున్నారు నాగార్జున.

అయితే మ్యాటర్ ఏమిటంటే, త్వరలో మరొక్కసారి విజయ్ బిన్నీతో మరొక మాస్ యాక్షన్ మూవీ చేసేందుకు నాగార్జున సిద్దమవుతున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ బజ్. త్వరలో అనౌన్స్ కానున్న ఈ మూవీని వేగంగా షూటింగ్ పూర్తి చేసి రానున్న 2025 సంక్రాంతి బరిలో నిలపాలనే ఆలోచనలో ఉన్నారట. కాగా అతిత్వరలో ఈ క్రేజీ మూవీ గురించిన వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు