‘పవన్ కళ్యాణ్’ హీరోయిన్ కి అరెస్ట్ వారెంట్ !

‘పవన్ కళ్యాణ్’ హీరోయిన్ కి అరెస్ట్ వారెంట్ !

Published on Jul 1, 2019 11:44 AM IST

మాజీ బ్యూటీ అమీషాపటేల్ ప్రస్తుతం సినిమాలు లేక, సోషల్ మీడియాలో రోజూ ఫోటోలు అప్ డేట్ చేసుకుంటూ.. అలా వచ్చిన సంపాదనతో ఎలాగోలా బండి నెట్టుకొస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ముదురు భామకు పెద్ద ఎదురు దెబ్బె తగిలింది. ఓ సినిమా నిర్మాణం కోసమని అజయ్ కుమార్ సింగ్ అనే ఫైనాన్షియర్ నుండి మూడు కోట్ల రూపాయలు తీసుకుందట. అయితే ఆ మూడు కోట్లు పెట్టి ఒక సినిమా నిర్మాణం కూడా చేపట్టింది ఈ అమ్మడు. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయి అమీషా పటేల్ ను సమస్యల్లోకి నెట్టేసింది.

దాంతో ఫైనాన్షియర్ అజయ్ కుమార్ సింగ్ కి డబ్బు తిరిగి ఇవ్వలేకపోయింది. చెక్ ఇచ్చినా అది కాస్త బౌన్స్ అయింది. ఇక అజయ్ కుమార్ సింగ్ కేసు పెట్టారు. దాంతో అప్పు ఎగవేసినందుకు ఆమెకు కోర్టు సమాన్లు జారీ చేసింది. రాంచీ కోర్టులో కేసు ఫైల్ అయింది. కాగా ఈ నెల 8వ తేదీన అమీషా కోర్టుకి హాజరు కావాలి.. లేదంటే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తారట. పాపం అమీషా పటేల్ ఇటు సినిమాలు లేక బాధ పడుతుంటే.. మళ్లీ ఈ కోర్టులు కోట్ల అప్పు అని నెటిజన్లు అమీషా పై జాలి వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ఈ ‘పవన్ కళ్యాణ్ హీరోయిన్’ ఈ కేసు నుండి ఎలా బయటపడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు