ఫిబ్ర‌వ‌రి 23న “చావు క‌బురు చ‌ల్ల‌గా” నుండి సెకండ్ సింగిల్ విడుద‌ల‌

ఫిబ్ర‌వ‌రి 23న “చావు క‌బురు చ‌ల్ల‌గా” నుండి సెకండ్ సింగిల్ విడుద‌ల‌

Published on Feb 20, 2021 6:00 PM IST


మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ‌బన్నీ వాసు నిర్మాత‌గా కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’. ‌ఇప్పటికే విడుదలైన టైటిల్, హీరో కార్తికేయ ‘బ‌స్తి బాల‌రాజు’ ఫ‌స్ట్ లుక్, ఇంట్రో కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఆ త‌రువాత విడుద‌లైన క్యారెక్ట‌ర్ వీడియో, లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ కి, టీజ‌ర్ గ్లిమ్ప్స్ కి, మైనేమ్ ఈజ్ రాజు అనే పాట‌కు కూడా అనూహ్య స్పంద‌న ల‌భించింది. ముఖ్యంగా కార్తికేయ గెట‌ప్‌, డైలాగ్ డెలివ‌రి మాడ్యూలేష‌న్ చూస్తే మ‌ళ్లీ చూడాల‌నిపించేలా ఉందంటూ కామెంట్స్ వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో చావు క‌బ‌రు చ‌ల్ల‌గా ఆడియో నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ ని విడుద‌ల చేయ‌డానికి ముహుర్తం ఖార‌రైంది. ఫిబ్ర‌వ‌రి 23న సాయంత్రం 4 గంట‌ల 5 నిమ‌షాల‌కి క‌దిలే కాలాన్ని అడిగా అంటూ సాగే ఓ బ్యూటీఫుల్ మెలోడీ సాంగ్ ని విడుద‌ల చేస్తున్న‌ట్లుగా హీరో కార్తికేయ‌, హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి ఉన్న ఓ ల‌వ్లీ పోస్టర్ తో ప్ర‌క‌టించారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి మాట్లాడుతూ ఇప్ప‌టికే చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రం నుంచి విడుద‌ల చేసిన ప‌బ్లిసిటీ కంటెంట్ కు అనూహ్య స్పంద‌న అంద‌చేసిన సినీ అభిమానులు అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగానే రాబోతున్న‌ క‌దిలే కాలాన్ని అడిగా పాట‌ను సిద్ధం చేసినట్లుగా కౌశిక్ తెలిపారు. చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రాన్ని మార్చి 19న భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత బ‌న్నీ వాసు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా పాట‌ల‌ను ప్ర‌ముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ వారు విడుద‌ల చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు