‘పెద్ది’ బ్లాక్‌బస్టర్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి.. మెగా ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్..!

‘పెద్ది’ బ్లాక్‌బస్టర్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి.. మెగా ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్..!

Published on Jun 23, 2026 2:00 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. వరల్డ్‌వైడ్‌గా ఇప్పటికే రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటేసి భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతున్న నేపథ్యంలో, చిత్ర యూనిట్ ఈరోజు(జూన్ 23) హైదరాబాద్‌లో గ్రాండ్‌గా సక్సెస్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు సిద్ధమైంది.

ఈ వేడుకకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తుండటం విశేషం. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ సక్సెస్ మీట్ ప్రారంభం కానుంది. మెగాస్టార్‌తో పాటు రామ్ చరణ్, బుచ్చిబాబు సానా మరియు చిత్ర యూనిట్ మొత్తం ఈ వేడుకలో సందడి చేయనున్నారు. మెగా తండ్రీకొడుకులను ఒకే వేదికపై చూసే అవకాశం రావడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయింది.

‘పెద్ది’ చిత్రంలో రామ్ చరణ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో పాటు జాన్వీ కపూర్ గ్లామర్, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు, బొమన్ ఇరానీల నటన సినిమాను నెక్స్ట్‌ లెవెల్‌కు తీసుకెళ్లాయి. వృద్ధి సినిమాస్ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు