ఆ దర్శకుడంటే భయపడుతున్న చిరు ఫ్యాన్స్..!

ఆ దర్శకుడంటే భయపడుతున్న చిరు ఫ్యాన్స్..!

Published on Aug 9, 2020 12:28 AM IST


దర్శకుడు మెహర్ రమేష్ తో మెగాస్టార్ చిరంజీవి మూవీ దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తుంది. 2015లో విడుదలై భారీ హిట్ అందుకున్న వేదాళం మూవీ తెలుగు రీమేక్ లో చిరంజీవి నటించనున్నారట. అజిత్ హీరోగా దర్శకుడు శివ తెరకెక్కించిన ఆ చిత్రం భారీ విజయం అందుకోవడం జరిగింది. దీనితో ఆ మూవీపై చిరు మనసు పారేసుకున్నారట. ఐతే ఆ మూవీ దర్శకుడుగా మెహర్ రమేష్ వ్యవహరించనున్నారట. ఐతే ఈ విషయమే చిరు ఫ్యాన్స్ ని కొంత ఇబ్బందికి గురిచేస్తుంది.

మెహర్ రమేష్ ట్రాక్ చూస్తే ఎవరైనా ఆయనతో మూవీ చేయడానికి భయపడతారు. కారణం ఆయన తెలుగులో నాలుగు సినిమాలు చేస్తే బిల్లా మాత్రమే ఓ స్థాయి విజయాన్ని అందుకొంది. ఆయన ఎన్టీఆర్ తో చేసిన కంత్రి, శక్తి, వెంకటేష్ తో చేసిన షాడో డిజాస్టర్స్ గా నిలిచాయి. దీనితో వేదాళం రీమేక్ దర్శకుడిగా మెహర్ రమేష్ అంటే ఫ్యాన్స్ భయపడుతున్నారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు