ఎమోషనల్ ట్వీట్స్ చేసిన సినీ ప్రముఖులు !

ఎమోషనల్ ట్వీట్స్ చేసిన సినీ ప్రముఖులు !

Published on May 10, 2021 11:55 PM IST

ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టీఎన్‌ఆర్‌ కరోనా మహమ్మారితో కన్నుమూసిన దురదృష్ట సంఘటన గురించి తెలిసిందే. టీఎన్‌ఆర్‌ జర్నలిస్ట్ గానే కాకుండా నటుడిగా కూడా మంచి గుర్తింపు పొందారు. ఆయన త్వరలో దర్శకత్వం కూడా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్న తరుణంలో ఇలా జరగడం బాధాకరమైన విషయం. కాగా సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయన మృతి పట్ల తమ సంతాపాన్ని వ్యక్తపరుస్తూ ఎమోషనల్ ట్వీట్స్ చేశారు.

“టీఎన్‌గారి మరణవార్త విని చాల బాధ పడ్డాను. ఆయన ఇంటర్వ్యూలను కొన్నిటిని చూశాను. ఇంటర్వ్యూల్లో అతిథులతో ఆయన మాట్లాడే తీరు అద్భుతం. వారి కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తున్నాను” – నాని

‘నమ్మలేని వార్త. నా ఫ్రెండ్ టీఎన్‌ఆర్‌ ఇక లేరనే వార్త జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. కరోనా కాస్తయినా దయ చూపించు. ఇక మా వల్ల కాదు. – డైరెక్టర్‌ మారుతి

‘టీఎన్‌ఆర్‌ గారు లేరనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన ఫ్యామిలీకి నా సానుభూతి. – డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని

‘మీతో నేను చేసిన రెండు ఇంటర్వ్యూలు నాకు ఇంకా గుర్తున్నాయి. మీరు చనిపోవడం మా ఇంట్లో అందరినీ కదిలించింది. మీ మాటలు, మీ ప్రేమ, సహనం ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. మిస్‌ యూ సర్‌” – విజయ్‌ దేవరకొండ

మంచు విష్ణు పోస్ట్ చేస్తూ.. “మీ మరణం మాలో బాధను మిగిల్చింది. ఇది ఒక పీడకల. మంచి మనిషి. సంవత్సరం క్రితం ఆయనతో చేసిన ఒక ఇంటర్వ్యూ నా కెరీర్‌లో బెస్ట్‌ ఇంటర్వ్యూగా నిలిచింది. ఆయన సన్నిహితులకు నా సంతాపం’ – మంచు విష్ణు

విస్మయానికి గురయ్యాను. మిస్‌ యూ టీఎన్‌ఆర్‌గారు. – సందీప్‌ కిషన్‌

మీ ఆత్మకు శాంతి చేకూరాలి. – ఈషా రెబ్బ

సంబంధిత సమాచారం

తాజా వార్తలు