టీవీ ఛానల్స్ కి కాసులు కురిపిస్తున్న కరోనా

టీవీ ఛానల్స్ కి కాసులు కురిపిస్తున్న కరోనా

Published on Apr 3, 2020 11:00 PM IST

కరోనా కర్ఫ్యూ కారణంగా ఇంటి నుండి కాలుబయటపెట్టలేని పరిస్థితి. ఈ ప్రాణాంతక వైరస్ వ్యాప్తి అంత కంతకు పెరుగుతూ పోతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. అత్యవసర పరిస్థితి మినహా అకారణంగా బయట తిరిగితే చట్ట పరమైన చర్యలు ఎదుర్కోవలసిందేనని హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నాపెద్దా తేడా లేకుండా అందరు ఇంటికే పరిమితం అవుతున్నారు. దీనితో చాలా మందికి ఆటవిడుపు అనేది లేకుండా పోతుంది. ఇక మెజారిటీ ప్రజలు టీవీలకు అతుక్కుపోతున్నారని సమాచారం. టీవీలో ప్రసారం అయ్యే సినిమాలు కార్యక్రమాలు వదిలిపెట్టకుండా చూస్తున్నారు. ఇందుకు నిదర్శనమే తాజా సినిమాల టీఆర్పీ రేటింగ్స్.

ఈ ఉగాది కానుకగా విడుదలైన రెండు హిట్ చిత్రాలు రికార్డు టీఆర్పీ దక్కించుకున్నాయి. మహేష్-అనిల్ రావిపూడి కాంబోలో సంక్రాంతి కానుకగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు చిత్రం గత నెల 25న ఉగాది కానుకగా జెమినిలో ప్రసారం కాగా భారీ టీఆర్పీ దక్కించుకుంది. 23.4 టీఆర్పీ దక్కించుకున్న సరిలేరు నీకెవ్వరు ఆల్ టైం రికార్డు నమోదు చేసింది. ఇక ధరమ్ తేజ్ హీరోగా దర్శకుడు మారుతీ తెరకెక్కించిన ప్రతిరోజూ పండగే చిత్రం సైతం అదే రోజు మా టివిలో ప్రసారమై 15.3 టీఆర్పీ దక్కించుకుంది. కరోనా లాక్ డౌన్ టీవీ ఛానల్స్ కి కాసుల వర్షం కురిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు