కోవిడ్‌ రిలీఫ్‌ ఫండ్‌ కు రజిని విరాళం !

కోవిడ్‌ రిలీఫ్‌ ఫండ్‌ కు రజిని విరాళం !

Published on May 17, 2021 5:58 PM IST

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కోవిడ్‌-19 పై పోరులో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను కలిసి 50 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. తమిళనాడులో కోవిడ్‌ బాధితుల కోసం ఆక్సిజన్, వ్యాక్సిన్‌ వంటి వైద్య సదుపాయాలను సమకూర్చడం కోసం, మరోవైపు ఉపాధి కోల్పోయిన ప్రజలకు ఆర్థికంగా అండగా నిలవడం కోసం సీఎం స్టాలిన్‌ దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. కోవిడ్‌ రిలీఫ్‌ ఫండ్‌కు విరాళాలు ఇవ్వాలని కోరారు.

ఈ క్రమంలో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు విరాళాలు అందించారు. అందరి కంటే ముందుగా హీరో సూర్య కుటుంబం కోటి రూపాయలు, సౌందర్యా రజినీకాంత్‌ ఫ్యామిలీ కోటి రూపాయలు అందజేశారు. అదే విధంగా, నటుడు శివకార్తికేయన్‌ రూ.25 లక్షలు, నిర్మాత, ఎడిటర్‌ మోహన్, ఆయన కుమారులు దర్శకుడు మోహన్‌రాజ, నటుడు జయం రవి కలిసి రూ.10 లక్షలు విరాళాన్ని అందించడం జరిగింది. తాజాగా రజినీకాంత్‌ కూడా ముఖ్యమంత్రిని కలిసి చెక్కు అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు