పాకిస్థాన్ వరకు చేరిన “సాహో” సారీ ప్రభాస్ ఫీవర్.!

పాకిస్థాన్ వరకు చేరిన “సాహో” సారీ ప్రభాస్ ఫీవర్.!

Published on Jul 13, 2019 3:45 PM IST

డార్లింగ్ హీరో ప్రభాస్ బాహుబలి రెండు చిత్రాల తర్వాత యావత్తు భారతదేశం అంతటా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటునిగా మారిపోయారు.అలాగే ప్రభాస్ కు లేడీస్ ఫాలోయింగ్ కూడా ఏ రేంజ్ లో ఉంటుందో అందరికి తెలిసిందే.అయితే ప్రభాస్ కు కేవలం ఒక్క తెలుగు రాష్ట్రాల్లోని మన దేశంలోనే కాదు ఆ క్రేజ్ ఖండాంతరాలు కూడా దాటిందని అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతం ప్రభాస్ హీరోగా శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా సుజీత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో “సాహో” సాహి చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా కోసం యావత్తు భారతదేశం అంతటా ఎదురు చూస్తుంది.అలాగే ఈ మధ్యన నాలుగు భాషల్లో విడుదలైన ఫస్ట్ సింగిల్ “సైకో సియాన్” మంచి స్పందనను రాబట్టింది.దీనితో పాకిస్తాన్ చెందిన ప్రముఖ నటి “మవ్రా హొకెన్” తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రభాస్ పేరు పెట్టి పాట కోసం ట్వీట్ చేసారు.దీనితో డార్లింగ్ అభిమానులు ప్రభాస్ ఫీవర్ పాకిస్థాన్ వరకు చేరుకుంది అని సోషల్ మీడియాలో తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే ఆగష్టు 15 న విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు