మూడు భాగాలుగా రానున్న ధనుష్ కొత్త చిత్రం !

మూడు భాగాలుగా రానున్న ధనుష్ కొత్త చిత్రం !

Published on Jun 21, 2018 1:54 AM IST


వెట్రిమారన్ దర్శకత్వంలో తమిళ స్టార్ నటుడు ధనుష్ నటిస్తున్న చిత్రం వడచెన్నై. 35 సంవత్సరాల క్రితం ఉత్తర చెన్నై లోని ప్రజల జీవిత నేపథ్యంతో తెరకెక్కుతుంది ఈ చిత్రం .ఈ సినిమాని మూడు భాగాలు గా తెరకెక్కించనున్నారు .

ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకి రెడీ అవుతుంది మొదటి భాగం ట్రైలర్ ని జులై 28 రిలీజ్ చేసి సెప్టెంబర్ లో సినిమాని ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు. ధనుష్ ఈ చిత్రంలో జాతీయ స్థాయి క్యారమ్ ప్లేయర్ గా నటిస్తున్నాడు ఇక రెండవ భాగం చిత్రీకరణ ప్రస్తుతం చెన్నై పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది . ఐశ్వర్య రాజేష్ , ఆండ్రియా కథానాయికలు గా నటిస్తున్నఈ చిత్రానికి సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నారు .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు