ధనుష్ ‘వడచెన్నై’ మొదటి వారంలో బాగానే రాబట్టింది !

ధనుష్ ‘వడచెన్నై’ మొదటి వారంలో బాగానే రాబట్టింది !

Published on Oct 23, 2018 9:00 PM IST

ధనుష్ నటించిన గ్యాంగ్ స్టర్ డ్రామా ‘వడచెన్నై’ మొదటి భాగం ఇటీవల విడుదలై మంచి రివ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇక మౌత్ టాక్ కు పాజిటివ్ గా ఉండడంతో మొదటి వారం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.43కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక చెన్నై సిటీ లో ఈచిత్రం ఇప్పటివరకు 4కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఈ చిత్రం అటు యూఎస్ఏ లోకూడా మంచి ప్రదర్శనను కనబరుస్తూ హాఫ్ మిలియన్ మార్క్ కు చేరువైయింది. వెట్రి మారన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేష్ , ఆండ్రియా కథానాయికలుగా నటించారు. ధనుష్ నిర్మించిన ఈచిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఇక ధనుష్ ప్రస్తుతం నాగార్జున తో కలిసి స్వీయ దర్శకత్వంలో మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు. డైరెక్టర్ గా ఆయనకు ఇది రెండో చిత్రం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు