విడుదల తేదీ ఫిక్స్ చేసుకున్న ‘దిక్సూచి’ !

విడుదల తేదీ ఫిక్స్ చేసుకున్న ‘దిక్సూచి’ !

Published on Apr 22, 2019 9:30 AM IST

దిలీప్‌కుమార్ స‌ల్వాది హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “దిక్సూచి”. డివొషనల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రన్ని శైలజ సముద్రాల, నరసింహ రాజు రాచూరి నిర్మిస్తున్నారు.‌ బేబి సనిక సాయి శ్రీ రాచూరి సమర్పణలో వ‌స్తున్న ఈ చిత్రం ఈ నెల 26న విడుదలవుతుంది.

ఈ సంద‌ర్భంగా దిలీప్ కుమార్ స‌ల్వాది మాట్లాడుతూ… నిర్మాత నర్సింహ రాజు గారు న‌న్ను న‌మ్మి డ‌బ్బులు పెట్టారు.వారి నమ్మకాన్ని వమ్ము చెయకుండా ఓ కొత్త జొనర్ లొ సినిమాను చేశాము. ఫ్యామిలీ అంతా వెళ్ళి చూసే చిత్ర‌మిది. 1970 బ్యాక్‌డ్రాప్‌లో స్టోరీ .సెమీ పీరియాడిక్ ఫిల్మ్‌. ఏప్రిల్ 26న గ్రాండ్ గా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో విడుదల చెస్తున్నాము. ఆస్ట్రేలియా, అమెరికాలో ఒక రోజు ముందుగానే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నామన్నారు.

దిలీప్‌కుమార్ స‌ల్వాది, చ‌త్ర‌ప‌తి శేఖర్‌, స‌మ్మెట గాంధీ, చాందిని భ‌గ‌వనాని, సుమ‌న్‌, ర‌జిత‌సాగ‌ర్‌, అరుణ్‌బాబు, ధ‌న్వి న‌టించిన ఈ చిత్రానికి ప్రొడ్యూస‌ర్స్ః న‌ర్సింహ‌రాజు రాచూరి, శైల‌జా స‌ముద్రాల‌, కెమెరాః జ‌య‌కృష్ణ‌, ర‌వికొమ్మి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ః ప‌ద్మనాభ్ భ‌ర‌ద్వాజ్‌, లిరిక్స్ః శ్రీ‌రామ్ త‌ప‌స్వీ, స్టోరీ, స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్‌,కట్స్: డైరెక్ష‌న్ః దిలీప్‌కుమార్ స‌ల్వాది ,

సంబంధిత సమాచారం

తాజా వార్తలు