దర్శకుడు పా.రంజిత్కు రాజరాజ చోళన్ను కించపరచేలా అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆయనపై కేసు నమోదైంది. మధురై హైకోర్టు శాఖలో పా.రంజిత్పై పిటిషన్ దాఖలు కావడంతో ఆయన మందస్తు బెయిల్కు దాఖలు చేసుకున్నారు.
దీంతో కోర్టు పా.రంజిత్ను ఈ నెల 21వ తేదీ వరకూ అరెస్ట్ చేయరాదంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారంతో ఆ గడువు పూర్తి కావడంతో పా.రంజిత్ మందస్తు బెయిల్ కోసం మరోసారి శుక్రవారం పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం శుక్రవారం పా.రంజిత్కు ముందస్తు బెయిల్ను నిరాకరించింది. దీనిపై విచారణ ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. దీనితో దర్శకుడు పా.రంజిత్ త్వరలోనే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం కలదు అని సమాచారం. పా.రంజిత్ సూపర్ స్టార్ రజని కాంత్ హీరోగా కబాలి, కాలా వంటి పెద్ద చిత్రాలకు దర్శకత్వం వహించారు.