డర్టీ పిక్చర్ పై నిషేధం విధించిన పాకిస్తాన్

డర్టీ పిక్చర్ పై నిషేధం విధించిన పాకిస్తాన్

Published on Nov 30, 2011 4:01 PM IST


విద్యా బాలన్ నటించిన ‘ది డర్టీ పిక్చర్’ చిత్రంపై పాకిస్తాన్ నిషేధం విధించింది. చిత్ర నిర్మాతలు డిసెంబరు 2న పాకిస్తాన్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేసారు. ఆ దేశ సెన్సార్ సభ్యులతో కూడిన బృందం విడుదలకి నిరాకరించింది. చిత్ర నిర్మాతలు కూడా ఈ విషయాన్నీ ధ్రువీకరించారు. ఈ చిత్రం ప్రముఖ నటి ‘సిల్క్ స్మిత’ జీవిత కథ ఆధారంగా తీసారంటూ భారీగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ చిత్రంలో విద్యా బాలన్ నటించిన సన్నివేశాలు పాటలు మీడియాకు విడుదల చేయగా భారీ స్పందన లభిస్తోంది. డిసెంబరు 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగుతో పలు భాషల్లో విడులవుతోంది. నసీరుద్దిన్ షా మరియు ఇమ్రాన్ హష్మి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు