వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన “డీజే టిల్లు”

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన “డీజే టిల్లు”

Published on Mar 28, 2022 12:00 AM IST


సిద్ధు జొన్నలగడ్డ హీరోగా విమల్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ డీజే టిల్లు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించడం జరిగింది. ఈ చిత్రం లో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా, బ్రహ్మాజీ, ప్రిన్స్ సిసిల్ లు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధం అవుతోంది. వచ్చే ఆదివారం ఈ చిత్రం స్టార్ మా లో సాయంత్రం 6:30 గంటలకు ప్రసారం కానుంది. బుల్లితెర పై ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను దక్కించుకుంటుందో చూడాలి. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల మరియు రామ్ మిరియాల సంగీతం అందించగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించడం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు