తమ సినిమా ప్రదర్శనలను నిలిపివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన లేడీ నిర్మాత !

తమ సినిమా ప్రదర్శనలను నిలిపివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన లేడీ నిర్మాత !

Published on Sep 22, 2018 3:07 PM IST

నూతన దర్శకుడు రాము కొప్పుల దర్శకత్వంలో, ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ కుమారుడు ‘రాహుల్ విజ‌య్’ హీరోగా రూపొందిన చిత్రం ‘ఈ మాయ పేరేమిటో’. రాహుల్ సరసన కావ్య తపార్ హీరోయిన్ గా నటించింది. వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్‌ బేనర్‌ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా నిన్న ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ రాహుల్ విజయ్ తన లుక్స్ అండ్ యాక్టింగ్ పరంగా మంచి మార్కులే కొట్టేసాడు. అతనికి తన టాలెంట్ చూపించుకోవడానికి ఈ సినిమా బాగానే పనికొచ్చింది.

అయితే తాజాగా ఈ చిత్రం చుట్టూ ఓ వివాదం చోటు చేసుకుంది. ఈ చిత్రంలో ఓ మతానికి సంబంధించిన మంత్రాన్ని.. ఓ పాటలో మరియు నేపధ్య సంగీతంలో వాడటంపై ఆ మత పెద్దలు కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ చిత్ర నిర్మాతలు ఆ మంత్రాన్ని మ్యూట్ లో పెట్టి తమ సినిమాని ప్రదర్శించారు. అయినా వివాదం మాత్రం సద్దుమణగలేదట. వివాదానికి కారణమైన మంత్రాన్ని మ్యూట్‌లో ఉంచి సినిమా ప్రదర్శించినా.. తన నంబర్‌ను సోషల్‌మీడియాలో సర్క్యులేట్‌ చేస్తున్నారని తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని, చిత్ర నిర్మాత దివ్యా విజయ్‌ తెలిపారు. కొన్ని చోట్ల అనవసరంగా తమ సినిమా ప్రదర్శనలను నిలిపివేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు